21.1 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

మంత్రి గంగుల ప్రచార వాహనంపై చెప్పులతో దాడి

స్వతంత్ర వెబ్ డెస్క్: కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పుతో దాడి చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్ కు చెందిన ఎల్ఈడి వాహనం నగరంలోని గోపాల్ పూర్ లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు జగదేశ్వరచారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.కాగా ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి క త్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ తరుణంలోనే నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్