ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 9, జార్ఖండ్కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించారు. శ్రీకాకుళం అభ్యర్థిగా పి.పరమేశ్వరరావు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను.. అమలాపురం అభ్యర్థిగా జంగా గౌతమ్ పేర్లను ప్రకటించారు. మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్. ఒంగోలు నుంచి ఈద సుధాకర్రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. నంద్యాల నుంచి జె.లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం అభ్యర్థిగా మల్లికార్జున్ వజ్జల, హిందూ పురం అభ్యర్థిగా సమద్ షహీన్ పేర్లతో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.


