19.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

మేడ్చల్‌ జిల్లా మైసిరెడ్డిపల్లిలో భూవివాదం

  భూ వివాదంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఓ వర్గం వారు కొంతమంది రౌడి మూకలను తీసుకొచ్చి, మరో వర్గంపై దాడి చేయించింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు గొడ్డలి, కర్రలు, కత్తి వంటి మారణాయు ధాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్