ఏపీలో ఆర్థిక వనరులపై దృష్టి సారించింది కూటమి సర్కార్. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో.. భారీస్థాయిలో నిధులను రాబట్టడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఒక్కనెలలోనే 9 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్బీఐ నుంచి మరో 2 వేల కోట్లను తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టనుంది.
ఇక ఒక్క నెలలోనే ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు వివరాలు చూసుకుంటే,.. జూన్ 21న 2 వేల కోట్లు, జూన్ 28న 5 వేల కోట్లు, మళ్లీ జూలై 12న 2 వేల కోట్ల రూపాయలకు RBI నుండి సెక్యూరిటీ బాండ్స్ రూపంలో అప్పుగా తీసుకుంది. మళ్లీ ఆర్బీఐని అప్పు కోరనుండటంతో కూటమి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.