స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు ఐటీ మంత్రి కేటీఆర్. అక్కడి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం 22 ఏళ్ల క్రితం లండన్లో ఉన్నప్పుడు ఓ ఫోన్ బూత్లో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ‘లండన్ లో 22ఏళ్ల క్రితం’ అనే క్యాప్షన్ జత చేశారు. లండన్ లో గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాను అని పేర్కొన్నారు. కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన బీఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లు హీరోలా ఉన్నారు.. సినిమాల్లోకి వచ్చి ఉంటే సూపర్ స్టార్ అయ్యే వారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
In London, 22 years back
Reminiscing as I return back home pic.twitter.com/XeejM8k8SA
— KTR (@KTRBRS) May 14, 2023