అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 చూపించారని.. ఎంపీ ఎన్నికలు రాగానే మోసం పార్ట్- 2 పేరుతో ఓటు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్ల మెంట్ ఎన్నికలు రాగానే పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి ప్రయత్నిస్తు న్నారని విమర్శించారు. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పు అవుతుందన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు.


