24.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

పాతాబస్తీ వాసులకు గుడ్ న్యూస్..

స్వతంత్ర వెబ్ డెస్క్: పాతబస్తీవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి తీసుకు రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. మెట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. అయితే, పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మున్సిపల్ అధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌తో మాట్లాడారు. మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు సీఎం చెప్పినట్టు కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమాతో పాటూ రాయదుర్గం రూట్‌లోని పలు ప్రాంతాల్లో 2.7 కిలోమీటర్ల మేర మిగిలిపోయిన నిర్మాణపనులను పూర్తి చేస్తే నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్