చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదన్నారు. రంజిత్ రెడ్డికి రాజకీ యంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శించారు.గత ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కంటే.. తానే ఎక్కువ అనుకొని వేరే పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక పార్టీ కంటే తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ రోజు లు ఉండలేరంటూ విమర్శించారు.


