స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఆయన్ను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించింది. 1986 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ప్రవీణ్ ప్రస్తుతం ఆ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్కుమార్ జైస్వాల్ రెండేళ్ల పదవీకాలం మే 25తో ముగియనుంది. దీంతో నూతన డైరెక్టర్ నియామకానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమై పరిశీలించించింది. వీరిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, సీనియర్ ఐపీఎస్ అధికారి తాజ్ హసన్ల పేర్లు పరిశీలనకు రాగా.. ప్రవీణ్ సూద్ వైపు కమిటీ మొగ్గు చూపింది.