స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన(Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్పై(Pawan Kalyan) ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్(Congress ) అధికారంలో ఉన్నప్పుడు సినీనటుడు చిరంజీవి(Chiranjeevi) తన ప్రజారాజ్యం పార్టీని(Praja Rajyam Party) కాంగ్రెస్లో విలీనం చేశారని, అదే తరహాలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని బీజేపీలో కలిపేస్తారని కేఏ పాల్ ఆరోపించారు.
అయితే, పవన్ రూ.ఐదు వేల కోట్ల డబ్బులు, క్యాబినెట్లో పొజిషన్ తీసుకుని బీజేపీలో కలిపేస్తారని చెప్పారు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. పవన్కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. మీడియాలో నీతి కబుర్లు చెబుతున్న చిరంజీవి. తన కూతురు ఓ బ్రాహ్మణున్ని పెళ్లి చేసుకుంటే అతడ్ని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్లు కావాలా? రియల్ హీరో కావాలా? సినీహీరో కావాలా? వరల్డ్ హీరో కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాల, మాదిగలను విడగొట్టినది మాజీ సీఎం చంద్రబాబు అని కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు.