కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులపై సీఎం, మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏమైందని నిరుద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్లాగా బీఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయదని తెలిపారు. నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కాంగ్రెస్ నేతలు డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.


