JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల చేశారు అధికారులు. జేఈఈ మెయిన్ ర్యాంకులను శనివారం ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయ దుంధిబి మోగించారు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ ని హైదరాబాద్కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య సాధించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది. జేఈఈ మెయిన్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటడంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.