34.1 C
Hyderabad
Friday, March 14, 2025
spot_img

జగన్ చాప్టర్ క్లోజ్..ఇప్పటికైనా మనిషిగా బతకడం నేర్చుకో- బుద్ధా వెంకన్న

టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిని నమ్మి బూతులు తిట్టినవారంతా.. జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించారు. జగన్ అధికారాన్ని చూసి విర్రవీగిన వారంతా.. తప్పకుండా ఊచలు లెక్కిస్తారని చెప్పారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆరోపించారు. వంశీ అరెస్టుతో.. ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని చెప్పారాయన. ఎక్స్ లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్ట్ పెట్టాడంటూ దుయ్యబట్టారు.

బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ” ఇప్పటికే వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ది చెప్పి ఓడించారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ .. ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతాడు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నీకు 11 సీట్లు వచ్చాయంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే డిసైడ్ చేశారు. అయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నాడు.

కొడాలి నాని, వల్లభనేని వంశీలు సిగ్గూ, శరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడు. వాళ్లిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదే. అలా ఎవరైనా వాగితే.. మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారు. నీలాగా .. నీచమైన రాజకీయాలు చేసి.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టించే సంస్కృతి టీడీపీకి లేదు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ చేస్తున్న కుట్రలు చూసి 11 సీట్లు కూడా అనవసరంగా ఇచ్చామని ప్రజలు బాధ పడుతున్నారు.

గత ఐదేళ్లల్లో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. టీడీపీకి జై కొట్టిన కార్యకర్తలను కూడా అరెస్టు చేయించారు, చంపించారు. అయినా ప్రజల కోసం, పార్టీ కోసం మా కార్యకర్తలు పోరాటం చేశారు. మేము దమ్ము, ధైర్యంగా మాట్లాడి.. నీ అవినీతిని ప్రశ్నించాం. చివరకు నీ తల్లిని, చెల్లిని కూడా.. నీచంగా మాట్లాడించిన దుర్మార్గుడివి నువ్వు. మా నాయకుడు చంద్రబాబు సారధ్యంలో మేము రాజకీయంగా తలపడే దమ్మున్న కార్యకర్తలం. నీలాగా ఇంట్లో ఆడవాళ్లను తిట్టించి పైశాచిక ఆనందం పొందేవారు రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు.

ఆరోజు వంశీ, కొడాలి నాని మాటలను ప్రజలంతా చీదరించుకున్నారు. నీ పిల్ల సైకోని అరెస్టు చేస్తే.. నువ్వు ఎక్స్ లో పోస్టు పెట్టావంటే.. నువ్వు ఎంత నీచుడివో అర్దం అవుతుంది. ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు సతీమణిగా భువనేశ్వరికి సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంది. తండ్రి, భర్త సీఎంలుగా ఉన్నప్పటికీ.. తనకంటూ సొంతంగా పారిశ్రామిక వేత్తగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించారు. అటువంటి తల్లిని అవమానిస్తే.. నీచంగా మాట్లాడితే.. నవ్వుకుంటూ సైకో లాగా ఆనందాన్ని పొందుతావా..? తల్లిని, చెల్లినే గౌరవించని జగన్ కు.. ఇంతకన్నా సంస్కారం ఉంటుందా?..

తన తప్పులు బయటకు రాకుండా మళ్లీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ వ్యవహరించాడు. చంద్రబాబు సారధ్యంలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఉంది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే జగన్ అరాచకాలు భరించలేక బయటకు వచ్చారు. భారతి రెడ్డికి నమస్కారాలు అన్నాడంటే.. అక్కడ ఎవరి పెత్తనమో అర్దం అవుతుంది. పిల్ల సైకో చేసిన దాడులకు, దూషణలకు చట్ట పరంగా శిక్ష అనుభవించక తప్పదు. జగన్ అధికారాన్ని చూసి విర్రవీగిన వారంతా.. తప్పకుండా ఊచలు లెక్కిస్తారు.

నారా లోకేష్ తన పాదయాత్రలోనే రెడ్ బుక్ ద్వారా చెప్పారు. నాడు నోటి దూల తీర్చుకున్న వారికి నేడు చట్టపరంగా దూల తీరుస్తామని ప్రకటించారు. ఇప్పుడు చేసిన తప్పులకు.. అరెస్టులు చేస్తుంటే.. గగ్గోలు పెడుతున్నారు. ఆనాడు నోరు పారేసుకున్నప్పుడు.. తప్పు చేస్తున్నామని తెలియదా?.. కళ్లు మూసుకుపోయి.. అధికార మదంతో మదమెక్కి వాగారు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రోజా వంటి వారితో ట్రైనింగ్ ఇచ్చి జగనే మాట్లాడించాడు. జగనే స్వయంగా తనకు 40 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించాడని విజయసాయిరెడ్డి చెప్పాడు.

ఆడవాళ్లను తిట్టించాడు..

రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేని జగన్ … ఇంట్లో ఆడవాళ్లను తిట్టించాడు. పులి, సింహం అని చెప్పుకుంటే సరిపోదు జగన్ రెడ్డి.. దమ్ముగా రాజకీయం చేయాలి. లేదా నాకు చేతకాదని రాజకీయాల నుంచి తప్పుకుని వెళ్లిపోవాలి. అంతేగానీ నీచంగా మహిళలను తిట్టిస్తావా?.. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తారా?. అదే మా అధినేత చంద్రబాబు .. మమ్మల్ని నోరు జారితే ఊరుకోరు. వంశీ, కొడాలి నానితో మాట్లాడించిన జగన్ కు రాజకీయంగా చరిత్ర ముగిసింది. ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చారు.. ఈసారి అవి కూడా ఇవ్వరు. రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్.. ఇప్పుడు అయినా మనిషిగా బతకడం నేర్చుకో. భ్రమల్లో బతకడం మానుకుని.. ఇప్పుడు అయినా వాస్తవంలోకి వచ్చి బతకండి. ఆనాడు అత్యంత నీచంగా నోరు పారేసుకున్న వారు, దాడులు చేసిన వారికి తప్పకుండా చట్టపరమైన శిక్షలు ఉంటాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానితో పాటు ఆనాడు ఇంట్లో ఆడవాళ్లను దూషించిన అందరినీ జైలుకు పంపాలని ప్రజలే కోరుకుంటున్నారు. 2019 లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంశీ అవినీతిపై విచారణ జరిగింది.

బ్రహ్మలింగయ్య చెరువు, భూములు, ఇళ్ళ స్థలాల కేటాయింపులో దోచుకున్నారు. అప్పుడే చంద్రబాబు అనేకసార్లు వంశీకి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తప్పులను ఒప్పు చేసుకునేందుకు వైసీపీలోకి వెళ్లాడు. అయితే ఉఛ్చనీచాలు మరచి వంశీ వ్యాఖ్యలు చేశాడు. వంశీని అరెస్టు చేస్తే.. ప్రజలు హర్షించారు.. వైసీపీ వాళ్లే గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. ఆరోజు వంశీ, కొడాలి నానీలను తిట్టవద్దని ఎందుకు వారించలేకపోయారు. జగన్‌ను నమ్మి బూతులు తిట్టినవారంతే.. జైలుకు వెళ్లడం ఖాయం.

జగన్ అవినీతిపై విచారణ వేగవంతం అయితే.. ఆయన కూడా మరోసారి ఊచలు లెక్కించడం ఖాయం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు.. ప్రతిపక్షంలో ఉండి .. ప్రజా సమస్యలపై పోరాటం మేము చేశాము. ఆనాటి వైసీపీ ప్రభుత్వ అవినీతిని అంశాల వారీగా బయటకు తెచ్చాం. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం జరగదు.. ప్రజలే ఎప్పుడో డిసైడ్ అయిపోయారు”.. అని బుద్ధా వెంకన్న అన్నారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్