25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

నాచారంలో రేపు ఈశా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి పోటీలు

ఈశా గ్రామోత్సవం రాష్ట్ర (డివిజినల్) స్థాయి పోటీలు సెప్టెంబర్ 10న నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరగనున్నాయి. 2004 నుండి ఈశా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈశా గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలు ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు. సాధారణ గ్రామీణులకు క్రీడల్లో ఉన్న సంతోషాన్ని రుచి చూపించడమే దీని ప్రత్యేకత.

ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 3 స్థాయిల్లో నిర్వహిస్తున్నారు. జిల్లా, డివిజినల్ ఇంకా ఫైనల్స్. ఫైనల్స్ కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో నిర్వహిస్తారు.

తెలంగాణలో 9 జిల్లాల నుండి జిల్లా స్థాయి పోటీలకు 227 వాలీబాల్, 119 త్రోబాల్ టీంలతో అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 2700 ఆటగాళ్ళు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణలోని 9 జిల్లాల విన్నర్‌లు, రన్నర్‌లు పాల్గొనే ఈ ఉత్సాహభరిత పోటీలకు SATS డైరెక్టర్ ఐఏఎస్ కొర్ర లక్ష్మి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారని, కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ తెలిపింది.

తేదీ: సెప్టెంబర్ 10,2023, ఆదివారం

సమయం:పోటీలు ఉ.9 నుండి,

ముగింపు కార్యక్రమం : 4 PM నుండి 5:30PM వరకు

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
96189 54075

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్