30.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

కన్నడ కింగ్ ఎవరో? మరికొన్ని గంటల్లో తేలనుంది

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఉండనుందని తేలడంతో అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో ఫలితాలపై జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.

కాంగ్రెస్ వస్తుందని కొందరు, బీజేపీ వస్తుందని మరికొందరు లేదు హంగ్ ఏర్పడి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫలితాల నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఏ పార్టీ ప్రలోభాలకు తమ అభ్యర్థులు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరి కన్నడనాట ఏ పార్టీ అధికారం చేపట్టనుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్