రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ అభయం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం అని, ప్రత్యేక హోదా పాశుపతాస్త్రం అని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ అభయం పేదలు, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చి వరం అన్నారాయన. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, అది తమ పార్టీతోనే సాధ్యం అని తెలిపారు. తాను మళ్లీ సీఎం కాకపోతే పథకాలు ఆగిపోతాయని జగన్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ప్రస్తుత పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో అమలైనవే అని తులసిరెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని, లేదా సీఎం పదవికి రిజైన్ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు.