ప్రజా ఆశీర్వాద సభ
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్లో ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగ నుంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభమయ్యే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థులు, కార్యకర్తలు, పాల్గొననున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
బీజేపీ సమావేశం
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా చాడ శ్రీనివాస రెడ్డి, నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొ న్నారు. కాంగ్రెస్ 60 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని సైదిరెడ్డి అన్నారు. దేశంలో రామాలయం కట్టిన ఘనత మోదీదే అని ఆయన కొనియాడారు.
అండగా ఉంటా….
వైసీపీ పాలనలో నష్టపోయిన వ్యాపారస్థులకు అండగా నిలుస్తామని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో వ్యాపార వర్గాలను ఆయన కలిశారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెంచిన ధరలను తగ్గిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.
బీజేపీలో చేరికలు
హనుమకొండ జిల్లా మడికొండలో 46వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్ బీజేపీలో చేరారు. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పోరేటర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.
దశాబ్దాల కల సాకారం
భద్రాచలం ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. భద్రాచలం, సారపాక మధ్య గోదావరిపై రెండో వారధిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బ్రిడ్జ్ను కలెక్టర్ ప్రియాంక ప్రారం భించారు. ఇచ్చిన మాట నెరవేర్చిన తుమ్మలకు భద్రాద్రి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 7.5 మీటర్ల వెడల్పు, 37 పిల్లర్లతో 65 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించారు.
కళాకారుడి ప్రతిభ
భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్.. చాక్ పీస్తో 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్ల IPL క్రికెట్ కప్పు నమూ నాను చెక్కాడు. సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండుపిన్ను సహాయంతో తయారు చేశాడు.
లబ్ధిదారుల ఆవేదన
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగనన్న ఇళ్లపట్టాలు పంపిణీ చేసి నాలుగేళ్లు పూర్తి అయినా రెవెన్యూ అధి కారులు అమ్ముకుంటుంన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా చాలా పట్టాలు అమ్ముకున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు.
తులసిరెడ్డి ఫైర్
రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. మోదీ, జగన్ ప్రభుత్వాల విధా నాల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. జగన్ పాలనలో పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడంలేదని మండిపడ్డారు.
చిన్నారి మృతి
జగిత్యాల జిల్లా మద్దుట్లలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ క్రింద పడి రెండేళ్ల అరిబా అనే చిన్నారి మృతి చెందింది. తన సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి అరిబా తన తల్లితో కలిసి వెళ్లింది. తన సోదరుడిని తల్లి బస్సు ఎక్కించడానికి వెళ్తుండగా వెనకాలే చిన్నారి వెళ్లింది. గమనించని వ్యాను డ్రైవర్ బస్సును కదిలించడంతో టైర్ల క్రింద పడి మృతి చెందింది.
విషాదం
హైదరాబాద్ సనత్నగర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. GHMC స్విమ్మింగ్ పూల్లో పడి పన్నెం డేళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ స్విమ్మింగ్ పూల్లో పడడంతో కార్తి కేయ తీసుకుని రావడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. అనుమా నాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
బీజేపీ పోరాట ఫలితమే..
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేస్తున్న వైఖరికి నిరసనగా బీజేపీ రైతుల పక్షాన పోటీ చేసిందని బీజేపీ నేత శంకరోళ్ల రవికుమార్ అన్నారు. బీజేపీ చేస్తున్న పోరాట ఫలితం గానే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. రైతులకు ఆగస్టు వరకు రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు.
బ్రహ్మోత్సవాలు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన సీతారామచంద్రస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మారుతి తెలిపారు.
సమీక్ష
GHMC పరిధిలోని రానున్న వర్షాకాల ఏర్పాట్లపై మున్సపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షాకాలంలో కాలనీలు, బస్తీల్లో ఇబ్బందులు రాకుం డా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ సమావేశం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీమంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్కు ఎమ్మెల్యే అనిల్, జాన్సన్ నాయక్ గజమాలతో స్వాగతం పలికారు. 500 వాహనాలతో ఆదిలాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.