Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మూడంచెల భద్రతలో.. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్

తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది. ఆంధప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మహా సంగ్రామంలో గతంలో కన్నా ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. దీంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ లపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

అటు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించు కున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసినా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిం చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది.

ఫలితాలపై అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీలు చేశారు. వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి.. స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్‌ రూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద్ద మూడంల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు.

ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. కౌంటింగ్‌ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటివరకు ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలోనే ఉంటాయి. స్ట్రాంగ్‌రూమ్‌ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. దీనికోసం మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రవేశమార్గాన్ని నిరం తరం సీసీటీవీ కెమేరాల నిఘాలో ఉంటుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్