ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ నేతలు ఈటల, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దేవాలయాలను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని వినతీ పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఈటల.. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు నగరంలో ఎంతోమంది బలయ్యారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని ఈటల ఆరోపించారు.