Jaana Reddy | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంలోకి వచ్చాక 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేశానని.. అయితే వచ్చే ఎన్నికలల్లో ఈసారి తాను పోటీ చేయడం లేదన్నారు. నల్గొండలో శుక్రవారం జరిగిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కుమారులు పోటీ చేస్తారా లేక ఒక్కరే పోటీ చేస్తారా అనేది వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇక వీరిద్దరికి టికెట్టిచ్చే విషయం గురించి అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్ర నేతలు, అధిష్టానం కోరిక అయితే సీఎంగా నియమించిన తర్వాత పోటీ చేస్తానని అన్నారు.
‘ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను’… జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
0
267
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


