36 C
Hyderabad
Friday, May 2, 2025
spot_img

నేను ఎవరికీ భయపడను… తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేస్తా- మైనంపల్లి

స్వతంత్ర వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli Hanumantha Rao) వివాదాస్పద వ్యాఖ్యలతో అను నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా తాను మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్(Audio Call) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా నేను ఎవరికీ భయపడను. నేను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలను. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చాను. నా స్టైల్ లో నేను ఉంటా..  మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చాను. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా.’’ అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ నెట్టింట వైరల్(Viral) గా మారింది. ఈ విషయంపై బిఆర్ఎస్ అధినేత ఏ విధంగా స్పందిస్తారు అన్న ప్రశ్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్