29.2 C
Hyderabad
Sunday, June 15, 2025
spot_img

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం

Huge Rush in Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో అన్ని క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా కావడంతో టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్