24.9 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

కేరళలో మాజీ సీఎం కుమారుడి విజయకేతనం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కేరళ మాజీ సీఎం, దివంగత కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కుమారుడు, చాందీ ఊమెన్  పుత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 36,454 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  చాందీ ఊమెన్ కు మొత్తం 78,098 ఓట్లు పోలయ్యాయి. సీపీఎం అభ్యర్థి థామస్ కు 41,644 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్ 6,447 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పుత్తుపల్లి స్థానంలో చాందీ ఊమెన్ మెజారిటీ పరంగా కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గ చరిత్రలో ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచిన నేతగా చాందీ ఊమెన్ నిలిచారు. 2011లో తన తండ్రి చాందీ ఊమెన్ సాధించిన 33,000 ఓట్ల మెజారిటీని అధిగమించారు.

ఈ ఫలితాలపై కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందిస్తూ.. ‘‘ఈ ఫలితాలు ఊహించినవే. ఎందుకంటే పుత్తుపల్లి ప్రజలు వారిని (అధికార పార్టీ) శిక్షించేందుకు వేచి చూశారు. తాము చేసిన దానికి సీపీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. పుత్తుపల్లి ప్రజలు బీజేపీ, సీపీఎంను విసిరికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల వ్యాఖ్యానించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్