26.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు… అసలు రాహుల్ ఏమన్నాడు?

Rahul Gandhi | కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలయింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( RSS​)పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ… ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువునష్టం దావా వేశారు. అయితే పరువునష్టం దావా వేసిన పిటిషనర్ ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త కావడం గమనార్హం.

అసలు విషయానికొస్తే.. 2023 జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్రలో భాగంగా ఆర్ఎస్​ఎస్​పై రాహుల్​ గాంధీ పలు విమర్శలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే.. 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కమల్ భదౌరియా పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై భదౌరియా తరఫు న్యాయవాది వివరాలు తెలుపుతూ… ‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులతో పోల్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోంది. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా సాయం చేసేందుకు ముందుండే సంస్థ ఆర్​ఎస్​ఎస్​. ఈ కేసు ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.’ అని వివరించాడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్