హైడ్రా కొత్తేదేమీ కాదని అక్రమంగా చేపట్టే నిర్మాణాలను గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేసేదని.. ఇప్పుడు దానికి పేరు మార్చి హైడ్రా పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగదని.. దుందుడుకు నిర్ణయాలు సరికావని హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీస్లో చిట్ చాట్ నిర్వహించిన కిషన్రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీపీఆర్ లేకుండా కూలగొడితే ఎలా? కూలగొట్టిన వాటికి బ్యాంక్ ఈఎంఐలు ఎవరు కట్టాలని నిలదీశారు. పేద ప్రజల ఇల్లు కూల్చమని తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చెప్పలేదన్నారు. హైడ్రా ఏమైనా భూతమా? అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం అంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి ఇప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు ఉండరని అంతా పేదవారే ఉన్నారన్నారు.