స్వతంత్ర, వెబ్ డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించవద్దని మరో అభ్యర్థి తాజాగా ఓ పిటిషన్ దాఖలు చేసి.. . గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.