స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటినుంచి 21 రోజులు పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో దశాబ్ది అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీ సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాం. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చెర్రీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…
— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023


