19.8 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

ఖేల్‌ రత్న అందుకున్న గుకేష్‌

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ గుకేష్‌ ఖేల్‌రత్న పురస్కారం అందుకున్నారు. గుకేష్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ పేరు మీద ఇస్తున్న ఖేల్‌రత్న పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం రాష్ట్రపతిభవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుకేశ్‌తో పాటు ఒలింపిక్‌ విజేతలు షూటింగ్‌లో మనూ భాకర్‌, హాకీ స్టార్ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఖేల్‌ రత్న అవార్డులు అందుకున్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు పారా అథ్లెటిక్స్‌లో జివాంజీ దీప్తి, అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ పురస్కారాలను స్వీకరించారు. వీరితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైం కేటగిరీలో.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మురళీధరన్‌ , ఫుట్‌బాల్‌ ఆటగాడు అర్మాండో ఆగ్నెలో కొలాకో పురస్కారాలు స్వీకరించారు.

అర్జున అవార్డు విజేతలు

అన్ను రాణి (అథ్లెటిక్స్‌)
నీతూ (బాక్సింగ్‌)
స్వీటీ బురా (బాక్సింగ్‌)
వంతిక అగర్వాల్‌ (చెస్‌)
సలీమా (హాకీ)
అభిషేక్‌ (హాకీ)
సంజయ్‌ (హాకీ)
జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ)
సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ)
స్వప్నిల్‌ సురేష్‌ కుసాలే (షూటింగ్‌)
సరబ్‌జోత్‌ సింగ్‌ (షూటింగ్‌)
అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌)
సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌)
అమన్‌ (రెజ్లింగ్‌)
రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చర్‌)
ప్రీతి పాల్‌ (పారా అథ్లెటిక్స్‌)
అజీత్‌సింగ్‌ (పారా అథ్లెటిక్స్‌)
సచిన్‌ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్‌)
ప్రణవ్‌ సూర్య (పారా అథ్లెటిక్స్‌)
హెచ్‌. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్‌)
సిమ్రాన్‌ (పారా అథ్లెటిక్స్‌)
నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌)
నితీశ్ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌)
తులసీమతి మురుగేశన్‌ (పారా బ్యాడ్మింటన్‌)
నిత్యశ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌)
మనీశా రాందాస్‌ (పారా బ్యాడ్మింటన్‌)
కపిల్‌ పర్మార్‌ (పారా జూడో)
మోనా అగర్వాల్‌ (పారా షూటింగ్‌)
రుబినా ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌)

అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌)

సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌)
మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌)

ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)

సుభాష్‌ రాణా (పారా షూటింగ్‌)
దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్‌)
సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ)

Latest Articles

అర్జెంటినాలో అధికారులు అర్జంట్ గా చేస్తున్న పని ఏమిటో తెలుసా…? సరండీ నది సరౌండింగ్స్ క్లీనింగ్ కు ప్లానింగ్

పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు...ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్