33.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్ లో ఉదయం పూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రం పూట వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణాల కోసం ప్రజలు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల అమీర్ పేట మెట్రో స్టేషన్లో అయితే ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి రద్దీ మార్గాల్లో షార్ట్ లూప్ ట్రైన్లను నడపనున్నారు. ఈ ట్రిప్పులతో రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట్-రాయదుర్గం కారిడార్‌లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక ట్రైన్‌ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మెట్రో ట్రైన్ ఛార్జీల పెంపునకు ప్రభుత్వం విముఖత చూపినట్లు తెలుస్తోంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్