27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…సంక్రాంతికి మరో 5 లక్షల ఇళ్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. తాజాగా విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పై సమీక్ష నిర్వహించారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా గూడు కల్పించాలని దూడ సంకల్పంతో ఈ పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఐదు లక్షలకు పైగా నిర్మించినట్లు తెలిపారు జోగి రమేష్. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఇల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులను కూడా వేగవంతం చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు జోగి రమేష్.

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్