Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ పార్థివదేహాం.. ప్రముఖుల నివాళులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ పార్థివ దేహానికి ప‌లువురు నివాళులు అర్పించారు. గద్దర్‌ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్‌ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్‌ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్‌ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్‌ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్‌ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్‌​ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం హైద‌రాబాద్ లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, నాయ‌కులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు.  గద్దర్‌ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్ ఆకునూరి మురళి, ఆర్ఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ , బీఆర్ఎస్ నేత‌లు వినోద్ కుమార్ , ర‌స‌మ‌యి బాల కిష‌న్ , కేంద్ర మంత్రి , బీజేపీ స్టేట్ చీఫ్ కిష‌న్ రెడ్డి, సీనియ‌ర్ నేత రాంచంద్ర‌రావు, విర‌సం స‌భ్యుడు, ప్రొఫెస‌ర్ కాశీం, ప్రముఖ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి , గాయ‌కురాలు విమ‌ల‌క్క‌, న‌ల్ల‌గొండ గ‌ద్ద‌ర్ , బీజేపీ సీనియ‌ర్ నేత వివేక్ వెంక‌టస్వామి, త‌దిత‌రులు నివాళులు అర్పించారు.

తెలంగాణ‌లోని తూఫ్రాన్ లో 1949 లో పుట్టిన గ‌ద్ద‌ర్ వ‌య‌సు 74 ఏళ్లు. త‌న జీవిత కాల‌మంతా పాటై ప్ర‌వ‌హించాడు గ‌ద్ద‌ర్. ఆయ‌న అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. జీవిత‌మంతా క‌ష్టాలు ప‌డ్డాడు. కానీ తాను న‌మ్మిన సిద్దాంతం కోసం చివ‌రి దాకా పోరాడాడు.  పాట‌తోనే ప్ర‌వ‌హించాడు. ప్ర‌జ‌ల‌ను నిత్యం చైత‌న్య‌వంతం చేసేందుకు కృషి చేశాడు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్