కాంగ్రెస్ ఇచ్చేది హామీలు, బీజేపీ ఇచ్చేది గ్యారెంటీలని అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునం దన్ రావు. రేవంత్ రెడ్డికి మెదక్లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని చెప్పారు. మోదీ పదేళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్దమా? అని సవాల్ విసిరారు. ఇక్రిశాట్, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు ఇందిరా గాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్న రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు ఎంతమందికి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు, రేవంత్ రెడ్డి నోటికేదోస్తే అది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు మండి పడ్డారు.


