స్వతంత్ర, వెబ్ డెస్క్: లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఈ ఏడాది మార్చి 19న జరిగిన దాడి దృశ్యాలు ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ వెబ్సైట్ ( https://nia.gov.in/video-gallery.htm ) లో సీసీటీవీ ఫుటేజిని అధికారులు అప్లోడ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆ సీసీటీవీ ఫుటేజిని చూసి ఎవరినైనా గుర్తుపడితే తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గుర్తుపట్టినవారు +917290009373 నెంబర్కు వాట్సాప్ ద్వారా చెప్పాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.