వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమురం భీం జిల్లా కాగజ్నగర్లో చోటు చేసుకుంది. అంద వెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి ఆవులు, గేదెలు నీటిలో కొట్టుకుపోయాయి. మూడుకిలోమీటర్ల మేర వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ దగ్గర పశువులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.


