22.2 C
Hyderabad
Wednesday, January 28, 2026
spot_img

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్‌ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అల్లీ సాహెబ్‌, షేక్‌ సురోజ్‌బాషా, మహ్మద్‌ అయాన్‌, అమాన్‌, రెహనాబేగంగా గుర్తించారు. షేక్‌ సురోజ్‌ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్