స్వతంత్ర, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గ్యాస్ సిలెండర్ పేలింది. షేక్ మీరా బి మౌలానా అనే మహిళ టీ పెట్టుకోవడానికి గ్యాస్ పొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే మౌలానా ఇంట్లో నుండి బయటికి పరుగులు తీసింది. ఒక్కసారిగా భారీ శబ్దం తో పేలిన సిలెండర్ పేలడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, రెండు సెల్ ఫోన్లు పూర్తిగా ఖాళీ బూడిద అవడంతో పాటు ఇంటి పైకప్పు ధ్వంసం అయ్యాయి. అయితే సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.