23.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

పవన్ కల్యాణ్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ.. అన్ని దారుల్ని మూసేసిన పోలీసులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavankalyan) ఋషికొండలో(Rushikonda) ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పరిశీలించేదుకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు.  షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం  పవన్ ఋషికొండకు వెళ్లాల్సి ఉంది.  ఋషికొండ  నిషేధిత స్థలం కాదని అయినా అక్కడికి వెళ్లకుండా చెక్ పోస్ట్ పెట్టడం పోలీసులు అడ్డుకోవడం సరికాదని జనసేన పార్టీ(Jenasena Party) స్పష్టం చేసింది.  రాజ్యాంగ హక్కుతో…ప్రజలకోసం ఋషికొండ పర్యటనకు పవన్ వెళ్లాలని స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని జనసేన ప్రకటించంది.  అడ్డుకోవడానికి మీకు ఏం హక్కు ఉందని జనసేన నేతలు ప్రశ్నించారు.  అడ్డుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.  ఋషికొండ పీపుల్స్ ల్యాండ్.. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి… ఆ అవసరం లేదన్నారు.  3 గంటలకు పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లి తీరతారు. పర్యటన తరువాత నిజానిజాలు బయట పెడతారని జనసేన నేతలు స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ఋషికొండ, ఎర్రమట్టి (Erramatti)దిబ్బల్ని పర్యటించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇందుకు నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఋషికొండవెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోవోటెల్ హోటల్ తో పాటు ఋషికొండ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరినీ ఇక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. నోవోటెల్ హోటల్లో జనసేన నేతలతో సమావేశం తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్