30 C
Hyderabad
Friday, May 30, 2025
spot_img

డీకే శివకుమార్‌ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎపిసోడ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతుంది. డీకే శివకుమార్‌ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే తన మద్దతుదారులతో డీకే శివకుమార్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచింది డీకే టీమ్. అయితే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు సిద్ధరామయ్య. ఈ రాత్రికి రాహుల్‌ను కలిసి సీఎం సీటు గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్‌ మధ్య గట్టిపోటీ నెలకొంది.

తన ఇంట్లో ప్రెస్‌మీట్‌ పెట్టిన డీకే శివకుమార్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ గెలుపుకోసం ఎంతో కష్టపడ్డానన్నారు. కాంగ్రెస్‌ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చానని అన్నారు. నా అధ్యక్షతన 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని.. ప్రస్తుతం సిద్ధరామయ్యతో నాకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా సిద్ధరామయ్య పాల్గొన్నారని తెలిపారు. అయితే సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లినా ధైర్యం కోల్పోలేదని వ్యాఖ్యానించారు. నాకున్న మద్దతుదారుల సంఖ్యను చెప్పను కానీ.. నా గురువును కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్తానన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్