ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనుకుకున్న సమయం కంటే ముందే ఆరు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి, ఐదేళ్లలో కూడా బీఆర్ఎస్ చేయలేదని మండిపడ్డారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడుగుతు న్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు కట్టిన ప్రతీ పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని స్పష్టంచేశారు.