36.1 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

జాకీలు పెట్టినా తెలంగాణలో బీజేపీ లేవదు- మంత్రి హరీశ్ రావు

స్వతంత్ర వెబ్ డెస్క్: జాకీలు పెట్టినా తెలంగాణలో బీజేపీ లేవదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు.  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన  ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో లోక్‌పోల్ సర్వే కలకలం రేపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే అంచనా వేసింది. దీనిపై బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు స్పందించారు.

 

కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుంటుంది. కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తుంది. ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారు..  పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణను కూడా అమ్ముకుంటుంది. గాంధీ భవన్‌లో మొన్నటిదాకా దరఖాస్తులను కూడా అమ్ముకున్నారని.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నారని హరీశ్ ఆరోపించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ రైతులకు బావుల వద్ద.. బోర్లకు మీటర్లను పెట్టమంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదు.. అలాంటి వారికి ఓట్లు వేద్దామా అని ప్రశ్నించారు.రెంటీ స్కీమ్ లు ఇచ్చామని తెలిపారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్