24.6 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బ్రిక్స్ సదస్సులో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ 3 పైనే- నరేంద్ర మోదీ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ(MODI) అభినందనలు తెలిపారు. మనం ఒక అద్భుతాన్ని చూశామన్నారు.  అంతరిక్ష చరిత్రలో  కొత్త చరిత్రను లిఖించామన్నారు.  ఇది నవభారత విజయమని కొనియాడారు మోదీ.  ఇది 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో  ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన  మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని చెప్పారు మోదీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు మోదీ. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన  జీవితం ధన్యమయ్యిందన్నారు. గగన్యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని  చెప్పారు.

చంద్రయాన్ 3 (CHANDRAYAN-3) చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు  చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటింది. చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.. ఇక ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు  చేయనుంది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్