26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు – నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి

పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ చెప్పారు. అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకర్‌ అన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే దిశగా పయనిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే నాయకర్‌తో పాటు నరసాపురం టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్