తెలంగాణలో కల్తీ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా డోంట్ కేర్ అంటూ యథేచ్చగా కల్తీ దందాను సాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ ఫుడ్పై కొరడా ఝుళిపి స్తున్న అధికారులు. తాజాగా యాదాద్రి జిల్లా కల్తీ పాల తయారీపై ఉక్కుపాదం మోపారు. భూదాన్ పోచం పల్లి మండలం మక్తాపూర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. తనిఖీ ల్లో 60 లీటర్లు కల్తీ పాలు, 250 హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 కిలోల దోల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకుని, ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


