34.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

ఏడాదిలోగా ఎన్నికలు ఉండొచ్చు… ప్రజలతో మమేకమై ఉండండి: సీఎం జగన్

CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పటిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘గడప గడప’ కు సంబంధించి ఇతర కార్యాక్రమాలన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిలోగా ఎన్నికలు ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ క్రమంలో పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలంతా నెలకు 20 రోజులపాటు ప్రజల్లోనే ఉంటూ.. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కాగా, సీఎం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, విడదల రజినితో పాటుగా మరికొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్