TSPSC Paper Leak | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్గూడ జైలులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదించింది. దీంతో ఈరోజు, రేపు వీరిద్దరిని చంచల్గూడ జైలులోనే విచారించనున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్పై ఈడీ దృష్టిపెట్టింది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.


