Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

     ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర చనున్నారు. తొమ్మిదో రోజు చివరి రోజు కావడంతో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మేనల్లుడు మేక శరణ్‌ పాత్ర ఏమిటి? డబ్బులు ఎలా చేతులు మారాయి? ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి? తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే.. కవిత, ఆమె భర్త అనిల్‌, వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి, ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని.. మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు ఇవాళ 11 గంటలకు మరోసారి ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలిసింది.

ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 9 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు.

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచా రించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్‌ చాటింగ్‌ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానా లను దాటవేసినట్లు సమాచారం.

      కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు ఇవాళ విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.ఈ రెండు వాదనలను రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్‌ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత రానుంది. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను నిన్న రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. ఇవాళ కోర్టు ముందుకు రానున్న బెయిల్‌ పిటిషన్‌ పై వారు చర్చించిన ట్టు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి? బెయిల్‌ నిరాక రిస్తే భవిష్యత్తు కార్యాచ రణ ఏమిటి? అనే అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్