టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జి శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణలకు నోటీసులు పంపించింది. ఈ నోటీసుల్లో నేడు, రేపు విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాల నమోదు చేసేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరారు. అయితే ఈడీ మాత్రం నిధుల మల్లింపు కోణంలోనే విచారణ జరుపుతోంది. టీఎస్ పీఎస్సీ కమిషన్ ఛైర్మన్తోపాటు కార్యదర్శి, సభ్యులను ఈడీ విచారించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. వీరికి కూడా త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, పేపర్ లీక్ కేసులో ఈడీ విచారణపై పులువురికి నోటీసులు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది.
Read Also: బీసీసీఐ కీలక నిర్ణయం… ఉప్పల్ స్టేడియానికి మహర్దశ
Follow us on: Youtube, Koo, Google News