స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తిన పర్యటనకు వెళ్లారు. అయితే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ మేరకు అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రెండు వర్గాలుగా విడిపోయినట్లు కేంద్రం పెద్దల దృష్టికి వచ్చిందని.. దీంతో విభేదాలను చక్కబెట్టేందుకే ఈటలను పిలిచినట్లు కమలం నేతలు చెబుతున్నారు.