25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

అభ్యర్థి మార్పు అచ్చెన్నాయుడికి చెక్ పెట్టేందుకేనా?

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలోని అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు కొన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం శ్రీకాకుళం జిల్లా టెక్కలి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణికి టికెట్ కేటాయించింది.

అయితే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఇంతలోనే వాణి పేరు ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాశంగా మారింది. అందులోనూ ఈ నియోకజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ప్లాన్‌తో వైసీపీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా అభ్యర్థి అయితే మహిళల ఓట్లు పార్టీకి పడవొచ్చనే ఆలోచనతో ఆమెను బరిలో దింపినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్