బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడు షేక్ ఫరూక్ ను ఎక్సైజ్ సీఐ శ్రీధర్, ఎస్సై రఘు, సిబ్బంది పట్టుకున్నారు. షేక్ ఫరూక్ వద్ద 4.1 గ్రాముల ఎండీ ఎంఎ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫరూక్ను అరెస్టు చేసి, జేఎఫ్సీఎం కోర్టు ముందు హాజరు పరిన ట్లు ఎస్టీఎఫ్ సీఐ శ్రీధర్ తెలిపారు. షేక్ ఫరూక్ బెంగళూరు నుంచి రహస్యంగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదా రాబాద్లో అమ్ముతున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకున్న ఎండిఎంఏ విలువ 50 వేల రూపాయలు ఉంటుందన్నారు.


